కల్తీ నెయ్యి కంపెనీపై ఎస్ఓటీ పోలీసులు దాడి

by Sridhar Babu |
కల్తీ నెయ్యి కంపెనీపై ఎస్ఓటీ పోలీసులు దాడి
X

దిశ శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవుపల్లి డివిజన్లోని కాటేదాన్ పారిశ్రామిక వాడలోని తెలంగాణ ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న ఓ కల్తీ నెయ్యి కంపెనీ పై గురువారం రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కంపెనీలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రంగా వెన్నను రీ ప్యాకింగ్ చేస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. కంపెనీకి అనుమతి లేదని గుర్తించారు. కంపెనీ యజమాని శ్రవణ్ ను అరెస్టు చేసి రెండు వాహనాలను సీజ్ చేసి మైలార్దేవుపల్లి పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. కంపెనీలో స్వాధీనం చేసుకున్న శాంపిల్స్ ని ఫుడ్ ఇన్​స్పెక్టర్​ కు పంపించినట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed