ఫార్మాసిటీ ఫ్యాబ్ సిటీ రైతుల సమస్యలను పరిష్కరిస్తాము : కేఎల్ఆర్

by Kalyani |
ఫార్మాసిటీ  ఫ్యాబ్ సిటీ రైతుల సమస్యలను పరిష్కరిస్తాము : కేఎల్ఆర్
X

దిశ, మహేశ్వరం: ఫార్మాసిటీ, ఫ్యాబ్ సిటీ(ఈ సిటీ)కి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేఎల్ఆర్, ధరణి కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరు మండలం లో ఫార్మాసిటీ మెడికల్ కాలేజీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తుక్కుగూడ మున్సిపాలిటీ లోని జన్నాయిగూడలో ఫ్యాబ్ సిటీ( ఈ సిటీ)కి భూములు ఇచ్చిన రైతుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్, కోదండ రెడ్డి మాట్లాడుతూ… రైతుల సమస్యలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దంతొజు నర్సింహ చారి, ఢిల్లీ శ్రీధర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed