- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జల్పల్లిలో వైకుంఠ రథాన్ని ప్రారంభించిన మంత్రి సబితా..

X
దిశ, బడంగ్పేట్: నిరుపేదల అంతిమ సంస్కారాలు కూడా అత్యంత గౌరవంగా సాగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా వైకుంఠ ధామాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మున్సిపాలిటీలో రూ.17లక్షల వ్యయంతో కూడిన వైకుంఠ రథాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఆఖరి మజిలీ ఘట్టం సజావుగా సాగడానికి అంతిమయాత్ర కోసం జల్పల్లి మున్సిపాలిటీలో వైకుంఠ రథం ఉచితంగా అందుబాటులో ఉండబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా బీన్ అహ్మద్ సాధి, జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వసంత, సయ్యద్ యూసుఫ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Next Story