కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం : రంజిత్ రెడ్డి
X

దిశ, షాబాద్ : కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం షాబాద్ మండల కేంద్రంలో రంజిత్ రెడ్డికి గజ మాల వేసి నాయకులు, వివిధ గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వందలాది మందితో రోడ్ షో నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎం ఎస్ గార్డెన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... ఆగస్టు 15వ రోజు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని, 3500 ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణా లోని హామీల మాదిరిగా ఎటువంటి పథకాలు లేవని, కోవిడ్ సమయంలో పేదలకు ఉచితంగా వస్తువులు పంపిణీ చేశానన్నారు.

భీం భరత్ మాట్లాడుతూ... షాబాద్ మండలం నుంచి 10 వేల మెజార్టీ ఇస్తామని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువకులను మోసం చేశారని, బీజేపీ దేవుని పేరుతో రాజకీయం చేస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కరెంట్ బిల్లు కట్టనవసరం లేదని అన్నారు. అలాగే మహిళలకు ₹ 2500, పింఛన్లు 4000 రూ, ఆగస్టు 15 తేదీ లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఇప్పటికే అమలు చేసిన నాలుగు గ్యారంటీ లు దోహదపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి సెక్రటరీ లు పిసరీ సురేందర్ రెడ్డి, రాంరెడ్డి, సున్నపు వసంతం, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంట రెడ్డి, అనిత సురేందర్ రెడ్డి, రషీద్ భాయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, ఎంపీటీసీ లు కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్,చల్ల రవీందర్ రెడ్డి, సత్య నారాయణ రెడ్డి,మద్దూరు మల్లేష్,మహిళా అధ్యక్షురాలు అశ్విని, సీనియర్ నాయకులు తమ్మలి రవీందర్, రవీందర్ రెడ్డి,అక్తర్, దండు రాహుల్,సర్పంచ్ లు చెన్నయ్య, జనార్ధన్,సుబ్రహ్మణ్యేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో వివిద గ్రామాల నుంచి లింగారెడ్డి గూడ సర్పంచ్ శేఖర్, కార్యకర్తలు 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Next Story

Most Viewed