అదుపుతప్పిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు

by Kalyani |
అదుపుతప్పిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
X

దిశ, రాజేంద్రనగర్: వేగంగా వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి డివైడర్ పై ఉన్న సీసీ కెమెరాలున్న స్థంబాన్ని ఢీకొంది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మంగళవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు వైపు నుంచి ఓ ప్రైవేటు బస్సు అతివేగంగా వచ్చి ఆరాంఘర్ చౌరస్తాలో అదుపుతప్పింది.

దీంతో రోడ్డు పైనున్న సీసీ కెమెరా స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనతో బస్సులో ఉన్న వారంతా ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed