తెలంగాణపై ప్రధాని మోడీ చిన్నచూపు.. ఎంపీ అసదుద్దీన్

by Shiva |
తెలంగాణపై ప్రధాని మోడీ చిన్నచూపు.. ఎంపీ అసదుద్దీన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాన మంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అససుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ప్రజా భవన్‌లో శనివారం నిర్వహించిన అన్ని పార్టీల ఎంపీల భేటీకి ఎంఐఎం తరుపున అసదుద్దీన్​ఓవైసీ హాజయ్యారు. మీటింగ్​అనంతరం ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ.. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలు ఇస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని కామెంట్ చేశారు.

ప్రధానంగా ట్రిపుల్​ఆర్​ మంజూరు, మెట్రో విస్తరణ, లంగర్​హౌజ్‌లోని బాపు ఘాట్​డెవలప్‌మెంట్, మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ సర్కార్ నివేదకలు పంపించిందని, రాష్ట్రంలో ఐపీఎస్​అధికారుల సంఖ్య పెంచాలని కోరిందని అససుద్దీన్​చెప్పారు. పార్లమెంటు లోపల, బయట తెలంగాణ అభివృద్ధి కోసం ఎంఐఎం పార్టీ మద్దతు కాంగ్రెస్​పార్టీకి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన వాటాలు, నిధులు, ప్రాజెక్టుల విషయంలో పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల‌పక్ష భేటీని స్వాగతిస్తున్నామని ఎంఐఎం నేత అసుసుద్దీన్ ఓవైసీ ఈసందర్భంగా స్పష్టం చేశారు.



Next Story

Most Viewed