MLA : స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం

by Kalyani |
MLA : స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని, నిజామాబాద్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

నిజామాబాద్ నగరంలో భూ అక్రమార్కుల భాగోతాన్ని బయటపెట్టాలన్నారు. భూ అక్రమార్కుల చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ డిమాండ్ చేశారు. నాగారం, బొందెం చెరువు కబ్జాల వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి సామాన్య ప్రజలను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మోసపోయిన ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు న్యాలం రాజు, కార్పొరేటర్ సాయివర్ధన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed