Crime : డబ్బుల కోసం తల్లిని చంపిన తనయుడు

by Kalyani |
Crime : డబ్బుల కోసం తల్లిని చంపిన తనయుడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకే తల్లిని కర్రతో కొట్టి హత్య చేశాడు.వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో అంజవ్వ అనే మహిళ భర్త ఏడాది క్రితం చనిపోతే వచ్చిన బీమా డబ్బులు రూ. 5 లక్షలు కొన్ని కొడుకు సాయికుమార్ కు ఇచ్చింది. మిగిలిన డబ్బులు తన పేరున బ్యాంకులో పొదుపు ఖాతాలో దాచుకుంది. మద్యం సేవించే అలవాటున్న కొడుకు సాయికుమార్ తల్లి ఇచ్చిన డబ్బులను మద్యానికి పూర్తిగా ఖర్చుచేశాడు. మళ్లీ డబ్బులకోసం తల్లిని వేధించడం మొదలు పెట్టాడు. ఆమె తన కోసం దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన కొడుకు తల్లిని కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో అంజవ్వ అక్కడికక్కడే చనిపోయింది.. ఈ ఘటన మంగళవారమే చోటు చేసుకోగా దీన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా తెలిసింది. చివరికి విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed