MP Arvind : రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కార్

by Aamani |
MP Arvind : రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కార్
X

దిశ ప్రతినిధి,నిజామాబాద్ : ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇంకా మోసం చేసేందుకే చూస్తోందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. రైతు రుణమాఫీ తో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 24న రైతులు చేపడుతున్న ఆందోళనకు త‌మ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నట్లు ఎంపీ తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని అందరి దేవుళ్ళపై ఒట్టేసి హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని, కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మమ అనిపించాలని ఎంపీ అర్వింద్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ని రొటేషన్ చక్రవర్తి అని అరవింద్ ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుణమాఫీ చేసిన తీరుపై అర్వింద్ ప్రశంసించారు.

రుణమాఫీ చేస్తే వై ఎస్ ఆర్ స్ లా చేయాలని ఎంపీ పీ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిపోతుందన్నారు. ప్రజా సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని మండిపడ్డారు. వడ్డీలేని రుణాలు ఇచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. కేసీఆర్ లాగే రేవంత్ కూడా అబద్ధాలు చెబుతూ కాలం వెళ్ళదీస్తున్నారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. రైతు సంక్షేమాన్ని వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం చేపడుతున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed