గర్భిణి , పిల్లలపై కుక్కల దాడి... గాయాలు

by Sridhar Babu |
గర్భిణి , పిల్లలపై కుక్కల దాడి... గాయాలు
X

దిశ, బోధన్ : బోధన్ పట్టణంలో కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం కుక్కల దాడిలో గర్భిణి, పిల్లలతో పాటు 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. బోధన్ పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద పెరుగుతున్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహంతో బీజేపీ ఫ్లోర్ లీడర్ వినోద్, ఆప్ నేతలు స్థానిక ప్రజలతో ధర్నా నిర్వహించారు. పట్టణ సీఐ వీరయ్య ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.

Advertisement

Next Story

Most Viewed