- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేశాయి
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేశాయని నిజామాబాద్ రూరల్ ఎం ఎల్ ఏ భూపతి రెడ్డి ఆరోపించారు. బుధవారం రూరల్ ఎంఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న క్రేజ్ ను చూసి ఎక్కడ ఓడిపోతామోనని బయపడి ఆ రేండు పార్టీ లు రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని అన్నారు.
ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని అన్నారు. ఇందుకు నిదర్శనమే పెద్దనోట్ల రద్దు విషయంలోబీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలకడం, అలాగే మోడీ తిసుకొచ్చిన అనేక చట్టాలకు బహిరంగంగా, తెరవెనుక మద్దతు పలికారని ఆయన అన్నారు. గత 5 ఏళ్లుగా ఎంపీ గా ఉన్న అరవింద్ పసుపు బోర్డ్ పేరు చెప్పి మాయ చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశ౦లో జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్, రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.