కార్మికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త డిస్పెన్సరీలు

by D.Reddy |
కార్మికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త డిస్పెన్సరీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కార్మికుల సంఖ్యకు అనుగుణంగా డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలని ఎంప్లాయిస్​స్టేట్​ ఇన్సూరెన్స్​కార్పొరేషన్​ (ESIC) యోచిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth reddy) ఆధ్వర్యంలో కార్మిక శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమయంలోనే ESIC డిస్పెన్సరీ ఆసుపత్రుల ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వరకు ESIC డిస్పెన్సరీలు ఉండగా, హైదరాబాద్ ​ఎర్రగడ్డలోని ESIC ప్రధాన ఆసుపత్రికే కార్మికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ క్రమంలో రోగుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో సుమారు 18 డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవే కాకండా రాష్ర్ట వ్యాప్తంగా మరో 20 నుంచి 25 వరకు ఈఎస్​ఐసీ డిస్పెన్సరీల అవసరం ఉంటుందని వైద్యులు తెలియజేస్తుండడం గమనార్హం. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ 18 డిస్పెన్సరీలలో ప్రాథమిక వైద్యంతో పాటు రెఫరెల్​సేవలు, మందుల పంపిణీ వంటి సేవలను అందిస్తాయి. డిస్పెన్సరీల బాధ్యతను ఈఎస్​ఐసీనే చూసుకోనుంది. ఆ విధంగా ఈఎస్ఐసీ ఆసుపత్రుల సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి కూడా కేంద్ర కార్మిక శాఖ నే చూసుకోనుండడం విశేషం.



Next Story