- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

దిశ, కోదాడ : ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఆటోలను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ హెచ్చరించారు. కోదాడ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ట్రాఫిక్ ఎస్సై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలు, మినీ టాటా ఏసీ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. హైవేలో వెళ్లేటప్పుడు యూటర్న్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆటోలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఆకతాయిల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైవర్లంతా డ్రైవింగ్ లైసెన్స్ - ఆర్సీ ఉంచుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.