- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
హరీష్ రావు లాంటి నేతలే ఆ పని చేస్తున్నారు.. మంత్రి పొన్నం హాట్ కామెంట్స్
దిశ, వెబ్డెస్క్: హైడ్రా(Hydraa) విషయంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ బాధితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. మూసీ బాధితులు అందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో పదేళ్ల పాటు నిర్వాసితులను లాఠీలతో అణిచివేశారని గుర్తుచేశారు.
మూసీ బాధితుల అంశంలో హరీష్ రావు(Harish Rao) లాంటి నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దయచేసి మూసీ నిర్వాసితుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలను కోరారు. హైదరాబాద్లో దీర్ఘకాలంగా నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తు్న్నట్లు తెలిపారు. పేదలను నిలబెట్టే సంస్కృతి కాంగ్రెస్ది.. పడగొట్టే సంస్కృతి బీఆర్ఎస్ది అని అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు అని చురకలు అంటించారు. బీఆర్ఎస్ పాలనలో నిత్యం అరెస్టులు జరిగేవని గుర్తుచేశారు.