Minister Ponguleti : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి..

by Sumithra |
Minister Ponguleti : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి..
X

దిశ, కూసుమంచి : రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించి కూసుమంచి మండలంలో ఆదివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని పాలేరు కిష్టాపురం తూరక గూడెం గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మార్గమధ్యంలో ఆయన మహిళా కూలీలతో మాట్లాడారు. వరి పంటలో ఎక్కువగా ఏ రకం సాగు చేస్తున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. రాజుపేట, జుజ్జుల్ రావు పేట ఇటీవల వివిధ కారణాలతో చెందిన పలుకుటుంబాలను పరామర్శించారు. అనంతరం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వ పనుల్లో నాణ్యత పాటించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, స్థానిక ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు, మండల అధ్యక్షుడు మట్టే గురువయ్య, బజ్జురి వెంకట్ రెడ్డి, జొన్నలగడ్డ రవి, జూకూరి గోపాల్ రావు, మంకేనా శ్రీనివాస్ రావు, యడవల్లి రామిరెడ్డి, బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed