- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘మినిస్టర్సాబ్.. అసలు మెదక్సంగతేంటి?’

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మెదక్పార్లమెంటరీ సెగ్మెంట్పై స్పెషల్గా ఫోకస్పెట్టారు. ఇప్పటికే ఈ లోకసభ నియోజకవర్గానికి సంబంధించి ఫీడ్బ్యాక్ను నటరాజన్ తెప్పించుకున్నారు. మంగళవారం గాంధీ భవన్లో మెదక్పార్లమెంట్సెగ్మెంట్లోని నేతలతో ఆమె రివ్యూ చేశారు. ఆమె లోకసభ పరిధి నియోజకవర్గాల నేతల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. నేతలంతా పార్టీ వ్యవహారాలు, చేపట్టాల్సిన అంశాలపై తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ విషయంలో మీనాక్షి సానూకులంగా స్పందించారు. అన్ని విషయాలను నోట్చేసుకున్నారు. కాగా, మీటింగ్ ముగిశాక ఏఐసీసీ రూమ్లో మీనాక్షి నటరాజన్మంత్రి దామోదర రాజనర్సింహాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘‘మినిస్టర్సాబ్.. అసలు మెదక్ సంగతేంటి? అని” మీనాక్షి నటరాజన్మంత్రిని ప్రశ్నించినట్లు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికలు నుంచి మొదలు పార్లమెంట్వరకు అక్కడ సీట్ల కేటాయింపు వ్యవహారం గురించి ఆరా తీసినట్లు సమాచారం. ప్రధానంగా మెదక్పార్లమెంట్లోకసభ నియోజకవర్గానికి కాంగ్రెస్పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నప్పటికీ, ఇతరులకు టికెట్ ఇవ్వడం వెనుక మతలబ్ ఏంటి అని అడిగినట్లు తెలిసింది. కేవలం ఇదీ ఇక్కడి వరకే జరిగిందా? అంతటా ఇదే కొనసాగిందా? అని కూడా ఆమె మంత్రిని అడిగినట్టు సమచారం. ఇకపోతే పటాన్చెరు లొల్లి ఏమిటని ప్రశ్నించిందట.. వీటన్నింటికి త్వరలోనే చెక్పెట్టాలని ఆమె ఈ సందర్భంగా మంత్రితో వ్యాఖ్యనించినట్లు తెలిసింది. ఏదైమైనా మీనాక్షి నటరాజన్అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల ఓటమికి గల కారణాలు, అలాగే, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతంతోపాటు గెలుపునకు ఎలా ముందుకెళ్లాలన్న దానిపై లోతుగానే ఫీడ్బ్యాక్తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.