వరద సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం: కార్పొరేటర్​ సబీహ బేగం

by Kalyani |
వరద సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం: కార్పొరేటర్​ సబీహ బేగం
X

దిశ, కూకట్​పల్లి: అల్లాపూర్​ డివిజన్​ పరిధిలోని సఫ్దర్​నగర్​, రాజీవ్​గాంధీనగర్​ కాలనీలలో కార్పొరేటర్​ సబీహ బేగం శనివారం పర్యటించారు. ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు, వరద నీటికి కొట్టుకు వచ్చి కాలనీలలో పేరుకు పోయిన చెత్త చెదారాన్ని పారిశుధ్య విభాగం అధికారులతో కలిసి తొలగింపు చర్యలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్​ సబీహ బేగం మాట్లాడుతూ వర్షాలకు ముంపు సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, కాలనీలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, కాలనీలో పేరుకు పోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, జ్ఞానేశ్వర్, రియాజ్, ఆశు, రమేష్, బాబా, ముత్యాల దుర్గ, షమ తదితరులుపాల్గొన్నారు.


Next Story