ప్రభుత్వ స్థలం ఆక్రమణలపై రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు

by Sridhar Babu |
ప్రభుత్వ స్థలం ఆక్రమణలపై రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు
X

దిశ, కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట లో గల ప్రభుత్వ సర్వే నంబర్ 348/1 లో బాలకృష్ణ అనే వ్యక్తి ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి దర్జాగా ప్లాట్స్ వేసి అమ్ముకుంటున్నాడని జగద్గిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ చేసిన భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జగద్గిరిగుట్ట కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ గణేష్, కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రవీందర్, కోశాధికారి రామకృష్ణ, శ్రీనివాస్ చారి, బుచ్చిరెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed