కూకట్​ పల్లిలో యువకుడు ఆత్మహత్య.. తీవ్ర కలకలం రేపుతున్న ఘటన

by Naveena |
కూకట్​ పల్లిలో యువకుడు ఆత్మహత్య.. తీవ్ర కలకలం రేపుతున్న ఘటన
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని హబీబ్​నగర్​ కాలనీలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. సిఐ రాజేష్​ తెలిపిన వివరాల ప్రకారం హబీబ్​నగర్​కు బోరింగ్​ గల్లికి చెందిన మొహ్మద్​ పాషా కొడుకు మొహ్మద్​ ఛోటు(25) గత నాలుగు నెలలుగా తీవ్రమైన నడుం నొప్పి, కుడి చేతి నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకున్న నొప్పి తగ్గకపోవడంతో.. మనస్థాపం చెందిన మొహ్మద్​ ఛోటు శుక్రవారం ఉదయం రెండవ అంతస్థులోని గదిలో ప్లాస్టిక్​ తాడుతో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. పాషా మూడవ కొడుకు చాంద్​ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వైద్యం కోసం ఎర్రగడ్డలోని చర్చి హాస్పిటల్​కు తరలించగా వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. తమ సోదరుడు తీవ్రమైన నడుం నొప్పి, చేతి నొప్పితో మనస్థాపం చెంది ఉన్నాడని, నొప్పి భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుడి సోదరుడు మొహ్మద్​ మహబూబ్​ పోలీసులకు తెలిపాడు.



Next Story

Most Viewed