- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మార్కండేయుని ఆశీస్సులు అందరిపై ఉండాలి : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

దిశ,సదాశివపేట: పట్టణంలో మార్కండేయ జయంతి సందర్భంగా శనివారం స్థానిక లోపలి కోటలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునిపల్లి విశ్వనాథ్ ఆధ్వర్యంలో లోపలి కోట హనుమాన్ మందిరం నుండి మార్కండేయ మందిరం వరకు మహిళలు సామూహిక కళాశాల ఊరేగింపు నిర్వహించారు. వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునిపల్లి విశ్వనాథ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మార్కండేయ జయంతి సందర్భంగా కళాశాల ఊరేగింపు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆ మార్కండేయుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆ దేవుని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వకులు మునిపల్లి రామకృష్ణ,నాగారం నర్సింలు,గుణాల సత్యం,కోల సురేష్,మునిపల్లి మనోహర్,గజం సురేష్, నాగారం పెంటయ్య,పోలా మనోహర్, వెంకటేశం, పద్మ గణేష్,విశ్వనాథం, గోపాల్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.