Mahesh Kumar: కొండా లక్ష్మణ్ బాపూజీ కలను సాకారం చెద్దాం.. టీపీసీసీ చీఫ్ నివాళులు

by Ramesh Goud |
Mahesh Kumar: కొండా లక్ష్మణ్ బాపూజీ కలను సాకారం చెద్దాం.. టీపీసీసీ చీఫ్ నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అణగారిన వర్గాల అభ్యున్నతి పట్ల ఆయనకున్న నిబద్ధతే మనకు స్ఫూర్తి అని, ఆయన కలలను సాకారం చేసే దిశగా ముందడుగు వేద్దామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్న మహేశ్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని తెలిపాడు.

అలాగే నిజమైన స్వాతంత్య్ర సమరయోధుడు, దూరదృష్టి కలిగిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి జ్యోతి ప్రజ్వలన చేసిన బాపూజీ అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అంతేగాక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి కృషి చేద్దామని చెబుతూ.. న్యాయమైన, సమానమైన సమాజం కోసం ఆయన కలలను సాకారం చేసే దిశగా కృషి చేద్దామని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story