- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PCC Chief: ప్రధాని మోడీ పదవి వ్యామోహ పిశాచి.. మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర పన్నుతోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పునర్విభనజపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టూరిజం ప్లాజాలో ఇవాళ అఖిలపక్షం ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ పునర్విభజన - దక్షిణ భారత భవిష్యత్ కార్యక్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిలిమిటేషన్ పై (Delimitation) చర్చించకుంటే చరిత్ర క్షమించదని ఈ విషయంలో పార్టీలకు అతీతంగా కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డిలిమిటేషన్ పేరుతో దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం ఏర్పడిన పార్లమెంటరీ నియోజకవర్గాలను కేంద్రం ఇప్పటివరకు స్తంభింపచేసిందని దీన్నే మరో 25 సంవత్సరాల పాటు పొడిగించాలని డిమాండ్ చేశారు. డిలిమిటేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) చర్చించి ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
మతం పేరుతో గెలిచి తెచ్చింది గుండు సున్నా:
తెలంగాణలో మతం పేరుతో 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు గెలిచిన బీజేపీ రాష్ట్రానికి తెచ్చిన నిధులు గుండు సున్నా అని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేవుడికి, రాజకీయాలకు ముడిపెట్టే బీజేపీ పార్టీని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల తరఫున ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడి ఈ బీజేపీ ఫాసిస్టు విధానాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 11 సంవత్సరాలు పాలించిన నరేంద్ర మోడీ (PM Modi)ఈ దేశానికి చేసింది ఏమీ లేదని కుల మతాలు మధ్య చిచ్చుపెట్టీ రాజకీయంగా లబ్ధి పొందాలని మాత్రమే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రధాని మోడీ పదవి వ్యామోహం పిశాచి అని రష్యా అధినేత పుతిన్ వలే నియంతలా దేశాన్ని పాలించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.