కవిత లిక్కర్ స్కాం నుంచి కాపాడటానికి బీజేపీకి ఊడిగం: కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్

by Ramesh N |
కవిత లిక్కర్ స్కాం నుంచి కాపాడటానికి బీజేపీకి ఊడిగం: కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే (KTR) కేటీఆర్ తాపత్రయ పడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. శనివారం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని (BRS) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై టీసీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పార్టీకి కట్టుబానిసలా కేటీఆర్ పని చేస్తున్నారని విమర్శించారు. సంఖ్యా బలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోందని తెలిపారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారని ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పని చేసిన మీరు, మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీకి దాసోహమయ్యారని పేర్కొన్నారు. మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు.

పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్? అని నిలదీశారు. పదేళ్లలో మోడీ నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం హాస్యాస్పదన్నారు. ఎమ్మెల్సీ కవితని లిక్కర్ స్కాం నుంచి కాపాడటానికి బీజేపీ కి ఊడిగం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ పై బిఆర్ఎస్ ప్రేమతోనే హెచ్‌సీయూపై రెండు పార్టీల నేతలు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. పదిహేను నెలల స్పల్ప కాలంలో రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగాలివ్వడం, రైతు, మహిళా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, బీసీలకు 42 రిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ వర్గీకరణ చేయడం, పేదలకు సన్నబియ్యం అందించడం వంటి గొప్ప పనులను రేవంత్‌ రెడ్డి సర్కార్‌ చేపట్టినా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనమని వివరించారు.



Next Story

Most Viewed