పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించండి: హైకోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు

by Kalyani |
పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించండి: హైకోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు
X

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించి కక్షిదారులకు మేలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు అన్నారు. శనివారం జిల్లా కోర్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి. రాజేష్ బాబు, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లా స్పెషల్ జడ్జి ఛాంబర్ ను ప్రారంభించారు.

అనంతరం జిల్లాలోని అన్ని కోర్టుల న్యాయమూర్తులతో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం తదితర అంశాలపై ఆయన సమావేశమయ్యారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాల్లోని ఆయా కోర్టుల న్యాయమూర్తులు సబిత, కే. స్వరూప, పుట్ట మౌనిక, కుమారస్వామి, విజయ్ కుమార్, వెంకటరమణ, సుజన్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వి. రఘునాథరావు, సభ్యులు ఎ. పర్వత్ రెడ్డి, డీఎస్పీ మోహన్ కుమార్ తదితులు పాల్గొన్నారు.



Next Story