వైద్యులు సమయపాలన పాటించాలి

by Sridhar Babu |
వైద్యులు సమయపాలన పాటించాలి
X

దిశ, అచ్చంపేట : వైద్యులు సమయపాలన పాటించాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజువారీగా విధులకు హాజరయ్యే వైద్యులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి ఒక్కరూ తప్పక సమయపాలన పాటిస్తూ పేదలకు వైద్యం అందించాలని సూచించారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. తదుపరి అన్ని వార్డుల్లో కలియతిరుగుతూ పేషెంట్లను వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, నాయకులు అంతటి మల్లేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story