- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రవి నాయక్
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రవి నాయక్
by Javid Pasha |

X
దిశ, జడ్చర్ల / మిడ్జిల్ : 13వ తేదీ సోమవారం జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కోలేటర్ జి.రవి నాయక్ అన్నారు. ఆదివారం ఆయన జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల, మిడ్జిల్ మండల కేంద్రంలోని యూపీఎస్ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
పోలింగ్ కేంద్రంలో మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మిడ్జిల్ మండల కేంద్రానికి రావడంతో తహసీల్దార్ రాజీవ్ రెడ్డి బొకేతో స్వాగతం పలికారు. కలెక్టర్ వెంట జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మిడ్జిల్ తహసీల్దార్ రాజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story