Collectorate : ప్రజావాణికి 35 ఫిర్యాదులు

by Naveena |
Collectorate : ప్రజావాణికి  35 ఫిర్యాదులు
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 35 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు..అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీఓ రాంచందర్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అలాగే అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ.. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed