సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

by Ramesh N |
సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, పార్టీ సినియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ గచ్చిబౌలిలోని నాగం జనార్ధన్ రెడ్డి నివాసానికి చేరుకోని ఆయనను పరామర్శించి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కేటీఆర్ వెంట పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో పాటు సినియర్ పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే లు మర్రి జనార్దన్ రెడ్డి, గణేష్ బిగాల, కోరుగంటి చందర్, ఎమ్మెల్సీ లు నవీన్ కుమార్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed