- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నువ్వు హిందువా.. క్రిస్టియనా..? అద్దంకిపై కొప్పు బాష తీవ్ర ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: అద్దంకి దయాకర్ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా పై విమర్శలు చేశారని, నీలా పూటకో పెళ్లి చేసుకునే చరిత్ర వారిది కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొప్పు బాష ఘాటు విమర్శలు చేశారు. అద్దంకి దయాకర్ మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని మాట్లాడినట్లు ఉందని, సీతారాముల చరిత్ర, దేశ చరిత్ర అద్దంకి దయాకర్కు తెలిసినట్లు లేదని విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు అద్దంకి దయాకర్ హిందువా.. క్రిస్టియనా..? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హిందువులను తిట్టమని చెప్పారా..? అంటూ ఆయన ధ్వజమెత్తారు.
అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై హిందూ సమాజమంతా ఆలోచన చేయాలని కోరారు. అద్దంకి నిత్యం దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని అద్దంకి దయాకర్తో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాట్లాడించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఇటలీ యూనివర్శిటీ నుంచి వచ్చిన వారికు భారతదేశ చరిత్ర ఏం తెలుసని విమర్శలు గుప్పించారు. అద్దంకి దయాకర్ అమ్మను, భార్యను ప్రేమించడని అర్థమైందని పేర్కొన్నారు. అద్దంకి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పూర్తి బాధ్యత వహించాలని, ఆయన్ను కోమటిరెడ్డి సోదరులే భరించలేదని, ఇక హిందూ సమాజం ఏం భరిస్తుందని కొప్పు బాష చురకలంటించారు.