మిషన్ భగీరథ పై కోమటి రెడ్డి అబద్దాలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు

by M.Rajitha |
మిషన్ భగీరథ పై కోమటి రెడ్డి అబద్దాలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మిషన్ భగీరథపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఫ్లోరోసిస్ భూతం ఉందని కల్లిబొల్లి మాటలు చెప్పడం బంద్ చేయాలని హితవు పలికారు. మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ దూరమైందని పార్లమెంట్ లో కేంద్రం సమాధానం ఇచ్చినప్పుడు ఎంపీ ఉన్నది మరిచిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, హర్షవర్దన్ రెడ్డి, జాజుల సురేందర్ మీడియాతో మాట్లాడారు. నెల్లికల్ లిఫ్ట్ పై ప్రజలకు కోమటి రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమృత్ స్కాంపై కేటీఆర్ పూర్తి ఆధారాలతోనే మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర కాంట్రాక్టులు దక్కించుకునేందుకే కేటీఆర్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చేస్తున్న పనులు చూసి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారా? అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎన్నికలప్పుడు గాల్లో మాటలు, అధికారంలో గాలి మోటార్ల యాత్రలు అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. శ్రీశైలం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి హానీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయన్నారు. గ్రామపంచాయతీలకు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రుణ మాఫీ పూర్తిగా అమలు చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed