- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రూప్ 2 దరఖాస్తు గడువు పొడిగించాలి

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గ్రూప్-2 నోటిఫికేషన్ అప్లై గడువును పొడిగించాలని తెలంగాణ జన సమితి పార్టీ విద్యార్థి విభాగం, విద్యార్థి జన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ.జనార్ధన్ రెడ్డికి నిరుద్యోగులు, వీజేఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థి జన సమితి అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ - 2 అప్లై చేసుకునే సౌకర్యం రెండు వారాలు పొడిగించాలని అన్నారు. చివరి మూడు రోజులగా ఇంటర్నెట్ కనెక్షన్ అసౌకర్యం వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అప్లై చేసుకోలేకపోయారని తెలిపారు. మానవీయ కోణంలో ఆలోచించి అప్లై గడువును పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వీజేఎస్ నాయకులు, నిరుద్యోగులు, గ్రూప్ - 2 అభ్యర్థులు బాల రాజ్, భీమ్ సేన్, నారాయణ రాథోడ్, మహేశ్, పవన్, నరేష్, శంకర్, ప్రశాంత్, సరళ, హేమ, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.