విద్యాశాఖ కార్యాలయం ముట్టడిస్తాం: బీఈడీ, డీఈడీ అభ్యర్థుల హెచ్చరిక

by srinivas |
విద్యాశాఖ కార్యాలయం ముట్టడిస్తాం: బీఈడీ, డీఈడీ అభ్యర్థుల హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీఎస్సీ ఫలితాలు విడుదల చేయాలని, లేదంటే అక్టోబర్ 5న విద్యాశాఖ కార్యాలయం ముట్టడిస్తామని బీఈడీ, డీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. డీఎస్సీ పరీక్షలు ముగిసి రెండు నెలలు గడుస్తోందని, ఫైనల్ కీ విడుదల చేసి కూడా నెల గడుస్తోందని, ఇంతవరకు ఫలితాలు ఎందుకు ఇవ్వడంలేదని ఆయన ప్రశ్నించారు. రిజల్ట్స్ వెంటనే ఇవ్వాలని, 11062 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. లేదంటే అక్టోబర్ 5న అభ్యర్థులతో కలిసి ముట్టడిస్తామని రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed