కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఊసరవెల్లి సైతం భయపడుతోంది: హరీష్ రావు

by Satheesh |
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఊసరవెల్లి సైతం భయపడుతోంది: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి రంగులు మార్చే ఊసరవెల్లి సైతం భయపడుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సభలో ప్రశిస్తే సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడలేదని, ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరణ చేయడం లేదని రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఇవన్నీ గమనిస్తున్నారని అన్నారు. నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం హాఫ్ నాలెడ్జీతో మాట్లాడుతున్నారని, మరీ ఆయనకు ఇలాంటి ఎవరు సలహాలు ఇస్తున్నారోనని సెటైర్ వేశారు. మేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక సభను వాయిదా వేసి పారిపోయిందని ఎద్దేవా చేశారు.

మేము అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందని.. పవర్‌లోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మరీ ఇప్పుడు ఎందుకు ఆ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం లేదని నిలదీశారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తోన్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కాంగ్రెస్ వస్తే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed