మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్

by Y. Venkata Narasimha Reddy |
మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్
X

దిశ, వెబ్ డెస్క్ : మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కాలేజీలో 200 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురైనట్లుగా సమాచారం. వాంతులు, ఒంటి నొప్పులతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ ఘటన పట్ల విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం సమాచారం ఇవ్వకపోవడం, కాయిన్ బాక్స్ ఫోన్లు వాడకుండా అడ్డుకోవడంపై ఆందోళనకు దిగారు. తమకు వెంటనే సిక్ లీవ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్ సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు, మీడియా వర్గాలు కళాశాలకు చేరుకోగా విద్యార్థులు జరిగిన ఘటన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Next Story