కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో మళ్లీ మసీద్: రఘునందన్ రావు సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 19 |
కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో మళ్లీ మసీద్: రఘునందన్ రావు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై మెదక్ లోక్ సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి దుబ్బాక రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే దేశమంతా బాంబులు పేలుతాయని, అయోధ్య రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అయితే అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక, ప్రధాని మోడీ గ్యారెంటీ ఇచ్చారంటే అది కచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. ప్రధాని మోడీ చొరవతోనే శతాబ్ధాల నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహోసోపేతమైన నిర్ణయాలు ఒక్క మోడీకే సాధ్యమన్నారు. సంగారెడ్డిని జగ్గారెడ్డి బహిష్కరించడం కాదు.. సంగారెడ్డి ప్రజలే జగ్గారెడ్డిని బహిష్కరించారని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed