- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్ ఆకస్మిక తనిఖీలు
by Satheesh |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. శనివారం పెద్దపల్లి మార్కెట్లో నడుస్తున్న పీపీసీ సెంటర్ను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులు ధాన్యం అన్లోడింగ్లో ఇబ్బందులు తెలియజేయగా డీఎస్ఓకి ప్రతి సెంటర్కు రెండు లేదా మూడు మిల్లులు టాగింగ్ చేయాలని ఆదేశించారు.
గోడౌన్లోని గన్ని సంచులు పరిశీలించి సంచుల విషయంలో ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సీఎంఆర్ డెలివరీ కోసం కొత్త సంచులు కావాలని కోరగా వెంటనే జీఎం మార్కెటింగ్కి ఫోన్ చేసి మంచిర్యాల జిల్లా నుంచి రెండు లక్షల కొత్త సంచులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ జిల్లాలోని అందరు మిల్లర్లు అధికారులు రైతులకు ఇబ్బంది కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story