- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అత్యధిక నిధులున్న పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో రిచ్చెస్ట్ రీజినల్ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు పొందింది. తమ బ్యాంకు ఖాతాల్లో రూ.1449 కోట్లు ఉన్నట్లు ఆ పార్టీ .. ఎన్నికల కమిషన్కు తాజాగా.. నివేదించింది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రూ.120.14 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీకి రూ.1110 కోట్లు ఉండగా.. పార్లమెంట్ఎన్నికలు ముగిసే నాటికి రూ.1449 కోట్లకు చేరుకున్నాయి. ఒక్కొక్క లోక్సభ అభ్యర్థికి రూ.95లక్షల చొప్పున .. 17 మందికి రూ.16.15 కోట్లను బీఆర్ఎస్ కేటాయించింది. ఎన్నికల ప్రచారం, క్యాంపెయిన్ ఇతర ప్రచార సామగ్రి, బహిరంగ సభలు, కేసీఆర్ ప్రచారం కోసం రూ.103.26 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియజేసింది. 2024 జూన్ నాటికి తమ పార్టీ వద్ద వివిధ బ్యాంకుల్లో రూ.1449.22 కోట్లు ఉన్నట్లు పార్టీ ప్రకటించింది.
బంజారాహిల్స్లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.840 కోట్ల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. కోటిలోని ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ల కింద రూ.510 కోట్లు ఉన్నాయి. ఈ రెండు బ్యాంకుల్లోనే ఫిక్స్డ్డిపాజిట్ల రూపంలో రూ.1350కోట్లు ఉన్నాయి. ఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వసంత్ విహార్ బ్రాంచిలో రూ.50.28 కోట్లు నిల్వ చేసింది. కోటిలోని ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో రూ.23.76 కోట్లు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు ఖాతాలో రూ.13.37కోట్లు, అదే బ్యాంకులోని వేరొక అకౌంట్లో రూ.8.72 కోట్లు ఉన్నట్లు ఈసీకి తెలిపింది. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయం బ్యాంకు అకౌంట్లో రూ.30.47 లక్షల ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది.