BREAKING: రాష్ట్రంలో మరో కీలక పరిణామం.. ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ

by Shiva |
BREAKING: రాష్ట్రంలో మరో కీలక పరిణామం.. ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి జీహెచ్ఎంసీ పూర్తి స్థాయి కమిషనర్‌గా అమ్రపాలి వ్యవహరించనున్నారు. హెచ్ఎండీఏ, మూసీ డెవలప్‌మెంట్, హెచ్‌జీ‌సీఎల్ అదనపు బాధ్యతల నుంచి ఆమె రిలీవ్ కానున్నారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా దానకిశోర్ అదనపు భాధ్యతలను స్వీకరించనున్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీ‌సీఎల్) ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ అడిషనల్ చార్జ్ తీసుకుంటారు. ఇక హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాస్తవ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చహత్ బాజ్‌పాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ మిత్తల్ నియమితులయ్యారు.

Advertisement

Next Story

Most Viewed