గ్రూప్-1 నియామకాలకు బ్రేక్.. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

by Ramesh Goud |
గ్రూప్-1 నియామకాలకు బ్రేక్.. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్-1 పరీక్ష (Group-1 Exam)ను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (RS MLC Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM revanth Reddy)కి బహిరంగ లేఖ(Letter) రాశారు. ఈ సందర్భంగా గ్రూప్- 1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైందని, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించిందని మండిపడ్డారు.

యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం ఆక్షేపనీయమని, గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు నెలకొంటున్నాయని తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం నెలకొన్నదని, 21,075 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ (TGPSC) ప్రకటించగా.. ఫలితాలు ప్రకటించే సరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరిందని, ఈ పది మంది అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది? అని లేఖ ద్వారా ప్రశ్నించారు.

అంతేగాక బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయని, సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్‌ పరీక్షలకు అప్పియర్‌ అయ్యారా? లేదంటే తర్వాత వారిని తెచ్చి చేర్చారా? అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొన్నదని పేర్కొన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని, దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో వ్యాల్యుయేషన్‌ చేయిస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించింది. కానీ రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమనాలున్నాయని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తర్వాత ఒక సెంటర్‌ను పెంచిందని, కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించిందని, అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు (High Court) కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసిందని వివరించారు. ఇక ''నీళ్లు- నిధులు- నియామకాలు'' తెలంగాణ రాష్ట్ర (Telangana State) ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని కవిత సూచించారు.



Next Story

Most Viewed