BJP : ధోతీలు ధరించి వచ్చి బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

by Rajesh |
BJP : ధోతీలు ధరించి వచ్చి బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తుందని ఆందోళనకు దిగారు. రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆంక్షలు లేకుండా రూ.2లక్షల వరకు రుణ మాఫీ చేయాలని కోరారు. అయితే ఈ సందర్భంగా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా ధోతి ధరించి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. రైతులందరికీ రుణమాఫీ అంటూనే కోతలు పెడతారా? ఇందిరమ్మ రాజ్యమంటూ రైతులను మోసం చేస్తారా అంటూ ఫ్లకార్డులను ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రదర్శించారు.



Next Story