BREAKING: భక్తులతో పోటెత్తిన యాదాద్రి పుణ్యక్షేత్రం.. కిక్కిరిసిన దర్శన క్యూ లైన్లు

by Disha Web Desk 1 |
BREAKING: భక్తులతో పోటెత్తిన యాదాద్రి పుణ్యక్షేత్రం.. కిక్కిరిసిన దర్శన క్యూ లైన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తుల రాకతో కలకలలాడుతోంది. ఆదివారం సెలవు దినం కావడం, పిల్లలకు పరీక్షలు ముగియడంతో స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామి వారి ఉచిత దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనం విషయానికి వస్తే.. సుమారు 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే దర్శన క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. పులిహోర, లడ్డూ ప్రసాద క్యూ లైన్లలో భక్తులు కీటకటలాడుతున్నారు.



Next Story

Most Viewed