- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Telangana Assembly Sessions : రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీ లో గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం సమావేశాల ఎజెండా ఖరారుకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు, ఏ అంశాలపై చర్చించనున్నారో ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఈనెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై గురువారం ఉభయసభల్లో వేరు వేరుగా చర్చించి ఆయనకు ధన్యవాదాలు తెలుపు తీర్మానం చేస్తారు. ఈనెల 17, 18 తేదీల్లో బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ తీర్మాణం చేయనున్నారు.
ఈనెల 19న బడ్ఝెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ నెలాఖరు వరకు సభ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్తో పాటుగా ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం అమలుచేస్తూ తీర్మాణమే ప్రధానంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకానున్నారు. తాను సమావేశాలకు వస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలు ఆసక్తికరంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతులు, నిరుద్యోగుల సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటిలు ఇలా పలు ప్రధానమైన అంశాలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అటంకాలు కలగకుండా సమావేశాలు జరిగే విధంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.