Assembly : శాసన సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్

by Rajesh |
Assembly : శాసన సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. అయితే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులపై చర్చ జరగగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మండిపడ్డాయి. దీంతో శాసన సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ‘కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్యాయం’ తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకించింది. కాగా , అసెంబ్లీలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటే మోడీకి మొదటి నుంచి చిన్నచూపు అన్నారు. తెలంగాణ ఏర్పాటునే మోడీ ఎన్నోసార్లు అవమానించారన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టారని సీరియస్ అయ్యారు.



Next Story