సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

by Sridhar Babu |
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, కడెం : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామంలోని చౌక ధరల దుకాణం -1 లో తెల్ల రేషన్ కార్డుదారులకు ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు గల కుటుంబాలకు పౌష్టికమైన ఆహారాన్ని అందించాలనే సదుద్దేశంతో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.

ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగేల భూషణ్, మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి, రమేష్ రావు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed