- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మామ్స్ కిచెన్ లో కుళ్లిన మాంసం

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మామ్స్ కిచెన్ లో కుళ్లిన మాంసం నిల్వలు ఉన్నట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లు, హోటల్లో కుళ్లిన మాంసాన్ని వండి పెడుతున్నారని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం ఆదిలాబాద్ మున్సిపల్ శానిటరీ అధికారులు దస్నాపూర్ లోని మామ్స్ కిచెన్ రెస్టారెంట్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
దీంతో మామ్స్ కిచెన్ లో ఫ్రీజర్ లలో ఉన్న మాంసపు నిల్వలను శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లెపూల నరేందర్ పరిశీలించారు. పెద్ద మొత్తంలో మటన్, చికెన్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అవి దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, కుళ్లిన మాంసాలను ఫ్రై చేసి వండి పెడుతున్నారని మండిపడ్డారు. అలాగే రైతు బజార్ సమీపంలోని వెంకటేశ్వర స్వీట్ హోమ్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు బూజు పట్టిన స్వీట్ పదార్థాలు ఉన్నట్లు గుర్తించి స్వీట్ హోమ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల తనిఖీలపై అనుమానాలు..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయని, ప్రతి దాంట్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ప్రజలకు వండి పెడుతూ నిర్వాహకులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ హోటళ్లలో, రెస్టారెంట్లలో తరచూ ఈ విధమైన నిల్వ ఉంచిన మాంసంను వండి పెడుతుండటం పై ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు పట్టించుకోవడంలేదని,వారి నిర్లక్ష్యం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మామూళ్ల మత్తులో పడి తూతూ మంత్రంగా తనిఖీలు చేయడం వల్లనే హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిళ్లకముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.