- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బిట్ కాయిన్ కుదుపు... మరో ఇద్దరి పై వేటు
దిశ, ప్రతినిధి నిర్మల్ : జిల్లాలో సంచలనం సృష్టించిన బిట్ కాయిన్/ క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు పడింది. ఈ మేరకు వారిని సస్పెండ్ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి డా. ఏ. రవీందర్ రెడ్డి తెలిపారు. బిట్ కాయిన్/క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ప్రమేయం ఉండి బుధవారం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించిన ఇద్దరు ఉపాధ్యాయులు దాసరి రమేష్ (ఎస్జీటీ, ఎంపీపీఎస్ కన్నాపూర్, కడెం మండలం) కీరం వెంకటేష్ గౌడ్, (ఎస్జీటీ, ఎంపీపీఎస్ దౌజి నాయక్ తండా, కుబీర్ మండలం) లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పోలీసులు రిమాండ్ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు ఎవరు కూడా ఇలాంటి వ్యవహారాల జోలికి వెళ్లరాదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు ఉపాధ్యాయులపై వేటు పడగా, తాజాగా మరో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది.