- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జనగామ కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు
దిశ, జనగామ : ఏసీబీ దాడులలో మరో ఇద్దరు అవినీతి అధికారులు పట్టుబడ్డారు. జనగామ కలెక్టరేట్ లో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో ఆర్ అండ్ బీ ఈఈ హుస్సేన్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ రవీందర్ లు లంచం సొమ్ముతో చిక్కారు. రూ. 14వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈఈ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ లో ఏసీబీ నిర్వహించిన దాడులు ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. జనగామ జిల్లా కేంద్రంలోని లింగాల గణపురం బండ్ల గుడా గ్రామానిని చెందిన చిర్రా సత్యపాల్ రెడ్డి ఎక్స్ సర్వీస్ మ్యాన్. హెచ్పీ బంక్ ఏర్పాటుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం ఈఈ హుస్సేన్ ను సంప్రదించగా..అతను 14000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు సత్యపాల్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఈఈ హుస్సేన్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ రవీందర్ లను బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఎవరైనా లంచం అడిగితే వెంటనే మాకు సమాచారం అందించాలని కోరారు.