ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు

by Disha Web Desk 13 |
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగ రావు, తిరుపతన్నలపై సైబర్ టెర్రరిజం సెక్షన్ లు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. దేశ భద్రతకు సాఫ్ట్ వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్)కింద నమోదు చేసే సైబర్ టెర్రరిజం కేసులు ప్రయోగిస్తారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని అక్రమంగా చొరబడి తస్కరించిన ఈ నలుగురు నిందితులపై ఐటీ యాక్ట్ 66 (ఎఫ్) కేసులు జోడించేందుకు అనుమతి కోరుతూ పంజాగుట్ట పోలీసులు తాజాగా నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నిరూపణ జరిగితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా ఇప్పటికే వీరిపై ఐటీ యాక్ట్ 70 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 70లో 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.



Next Story

Most Viewed