ఇంటర్​ విద్యార్థులకు మరో ఛాన్స్

by  |
ఇంటర్​ విద్యార్థులకు మరో ఛాన్స్
X

దిశ, న్యూస్​బ్యూరో: పరీక్షా పత్రాల రీకౌంటింగ్​, రీ వెరిఫికేషన్ కోసం గడువు పెంచుతున్నట్టు ఇంటర్మీడియట్​ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞాపనల మేరకు గడువు పెంచుతున్నట్టు బోర్డు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఆన్​లైన్​ పరీక్ష పత్రాలను చూసుకునేందుకు ఈ నెల 30వరకూ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్ధేశిత ఫీజు చెల్లించిన విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్​సైట్​ ద్వారా తమ ఆన్సర్ షీట్లను చూసుకోవచ్చని వెల్లడించారు.


Next Story

Most Viewed