తెలంగాణలో ఒక్కరోజే 2,392 కేసులు

by  |
తెలంగాణలో ఒక్కరోజే 2,392 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24గంటల్లో 2,392 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరుకుంది.

ఇందులో 31,670 యాక్టివ్ కేసులుండగా.. కొత్తగా 2,346 మంది రికవరీ కాగా, ఇప్పటివరకు 1,12,587 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడచిన 24గంటల్లో 11 మంది మృతి చెందగా.. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 906 కు చేరింది. కాగా, గడచిన 24 గంటల్లో 60,923 టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 18,27,905 కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.


Next Story

Most Viewed